నవీపేట, ఏప్రిల్ 10: మండలంలోని ఫకీరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ తెలిపారు. వివరాల ఇలా ఉన్నాయి. కోస్లీ గ్రామానికి చెందిన జల్లెల సాయిలు(52) అనే కూలీ కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు.
ఆరోగ్య సమస్య అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య చంద్రకళ, కుమారుడు గంగాప్రసాద్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.