డిచ్పల్లి, డిసెంబర్ 23 : జక్రాన్పల్లి మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై వివేక్నగర్ తండా సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి నుంచి డిచ్పల్లి వెళ్తున్న ఆటోను కియా కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లోకి ఆటో దూసుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. ఆటోడ్రైవర్ షౌఖత్అలీ, ఖాదర్ ఖాజాతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.