75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించి, జనగణమన పాడారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు, అన్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆవిష్కరించారు.
పాఠశాలల్లో విద్యార్థులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు, చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు బహుమతులను అందజేశారు.