మోర్తాడ్, జూలై 6: జిల్లాలోని ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 6,090 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1066.80 అడుగుల (18.443 టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 654 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా, కాకతీయ కాలువకు వంద, మిషన్భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 323 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.