మాక్లూర్, ఫిబ్రవరి 27: సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు రూ.3వేల కోట్ల నిధులు తీసుకెళ్లి నిజామాబాద్ తదితర జిల్లాలకు అన్యాయం చేశారని, త్వరలోనే కొడంగల్కు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేపడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. మండలంలోని కల్లెడి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ అధికారిక జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాలు సేవాలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. తండాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ పార్టీలకతీతంగా నిధులు మంజూరు చేసి తండాలను అభివృద్ధి చేస్తామని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, అనంతరం అందరం కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ప్రహరీ నిర్మాణానికి రూ.2లక్షలు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్లు షబ్బీర్, సురేశ్, ఎంపీడీవో జయక్రాంతి, కార్పొరేటర్ రాయ్సింగ్నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు గణపతినాయక్, పీర్సింగ్ నాయక్, లత, లావణ్య పాల్గొన్నారు.