కోటగిరి/ వర్ని, ఏప్రిల్ 4 : ‘పాడి రైతుల ఆపసోపాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. వర్ని, కోటగిరి మండలాలకు చెందిన పాడి రైతులకు 15రోజుల బిల్లులను విడుదల చేశారు.
కోటగిరి రైతులకు రూ.1.59లక్షలు, వర్ని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పరిధిలోని రైతులకు రూ.8లక్షలు విడుదలయ్యాయి. మొత్తం 45 రోజులకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉండగా, 15 రోజులవి మాత్రమే చెల్లించారని, మిగతా రెండు విడుతల బిల్లులు చెల్లించాలని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షులు ఉదయ్, దేవరాజు కోరారు.