స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై జెండాను ఎగురవేస్తారని అధికారులు తెలిపారు. ఏర్పాట్లను అధికారులు పరిశీలించి, అంబరాన్నంటేలా వేడుకలు నిర్వహించాలని సూచించారు.