ఇందూరు, జూలై 14 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవే టు విద్యాసంస్థల సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవ డం గొప్ప విషయమని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ హైస్కూల్లో జిల్లా అధ్యక్షుడు జయసింహాగౌడ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు ఉపాధ్యాయులను ఆ దుకుని రూ.2 వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం ఉపాధ్యాయులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని.. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పక్షాన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థుల అడ్మిషన్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. యూడైస్లో కూడా నమోదయ్యేలా చూసుకోవాలన్నారు. లేదంటే విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని గుర్తు చేశారు. తల్లిదండ్రులకు పాఠశాలల నుంచి ఫోన్ వస్తే ఫీజుల కోసమని పాఠశాలలకు రావడం లేదని.. కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న మోసానికి, ప్రైవేట్ పాఠశాలలను తల్లిదండ్రులు అపార్థం చేసుకుంటున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యనందిస్తున్నాయని.. తల్లిదండ్రులు గమనించాలని కోరారు. జయసింహాగౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు సహకారమందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోహన్, కాంతి గంగారెడ్డి, ప్రవీణ్, గంగారెడ్డి, సుందర్, నిత్యానందం, మోహన్, సాయికృష్ణ, మాన్సింగ్, శ్రీకాంత్, చంద్రకాంత్, ముజీబ్, గోవర్ధన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.