ఖలీల్వాడి/ఇందూరు/నిజామాబాద్ రూరల్/కోటగిరి /బోధన్/బోధన్రూరల్/బాల్కొండ/ఎడపల్లి, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని తపాలా ఉద్యోగులు హర్ఘర్ తిరంగాపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు.
నాగారంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జైనబ్, రీజినల్ కో-ఆర్డినేటర్ సంపత్కుమార్, వైస్ప్రిన్సిపాల్ కళాజ్యోతి పాల్గొన్నారు. నగరంలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పర్సనల్ మేనేజర్ శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచులు నగేశ్, శేఖర్గౌడ్, సుప్రియానవీన్, ఖన్నీసాబేగం, జీపీ కార్యదర్శులు సుధాకర్రెడ్డి, ప్రశాంత్కుమార్, ఆనంద్, సౌమ్య పాల్గొన్నారు. కోటగిరి మండలంలో బుధవారం నుంచి ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బోధన్ పట్టణంలో ఇంటింటికీ మున్సిపల్ అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ భైరి శంకర్, ఎన్విరాన్మెంటల్ అధికారి దేవేందర్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ జాతీయ జెండాలను అందజేస్తామని బోధన్ మండలం ఖాజాపూర్ సర్పంచ్ చింతపు నాగయ్య తెలిపారు.
బాల్కొండ మండలం కిసాన్నగర్లో సర్పంచ్ మానేటి తులసీనాగభూషణం ఇంటింటికీ జాతీయ జెండాలను అందజేశారు. ఉపసర్పంచ్ చించు శ్రీనివాస్గౌడ్, వార్డు సభ్యులు స్వామినాథ్, శరత్కుమార్, వేముల శ్రీనివాస్, కార్యదర్శి రేణుకాదేవి, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘం సభ్యులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ రాజేశ్వర్ ఇంటింటికీ జాతీయ జెండాలను అందజేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని కోరారు. ఫ్లాగ్ కోడ్ పాటించాలని సూచించారు. మల్లెపూల శ్రీనివాస్, బాబర్, గంగారాజు, దేరడి అబ్బులు, సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.