నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/ధర్పల్లి, ఆగస్టు 10 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం నగర శివారులోని ఆర్యనగర్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మంగళవారం సందర్శకులతో కిటకిటలాడింది. క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే బాజిరెడ్డి మంగళవారం ఉదయం నుంచి క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉండగా, నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలు ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతిపత్రాలు అందజేశారు. సమావేశపు హాలులో ఎమ్మెల్యే బాజిరెడ్డి కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వినతిపత్రాలు స్వీకరించారు. గ్రామాలకు చెందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించారు.
డిచ్పల్లి మండలం ఘన్పూర్లో చేపట్టిన కల్యాణమండపం నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ఎంపీటీసీ రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ సతీశ్రెడ్డి, ఉపసర్పంచ్ రంజిత్, కొండూరు సాయిలు, యెన్నోళ్ల రాజు, కిరణ్, రాజేశ్వర్, నర్సయ్య, లింబాద్రి, నాని, శ్రీను, సుమన్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడ్గు సర్పంచ్ నీరడి పుష్పాసుబేందర్ జీపీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడంలేదని మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు మహిపాల్యాదవ్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, నిధులను దుర్వినియోగం చేస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయవెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.