జక్రాన్పల్లి, జూలై 19 : గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఉపాధిహామీ పథకం ద్వారా పనికల్పించి కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ ఎంపీడీవో లక్ష్మణ్ను ఆదేశించారు. మండలంలోని పడకల్, సికింద్రాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులతోపాటు ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అసంపూర్తిగా ఉన్న పల్లెప్రకృతి వనాల పనులను పూర్తిచేయాలని, వైకుంఠధామాల్లో వెంటనే మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ చెత్తను సేకరించాలని, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట ఏపీవో రవి, ఆయా గ్రామాల సర్పంచులు పుప్పాల శ్రీనివాస్, తలారి గంగామణి, ఉప సర్పంచులు రుత్విక్, అప్పాల అరుణ్కుమార్ తదితరులు ఉన్నారు.