వన దేవతలకు మొక్కులుతీర్చుకున్న గిరిజనులు
సిరికొండ,జూలై11: గిరిగూడేల్లో ఆదివారం అకాడీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పొచ్చంపల్లి,రిమ్మ,జెండాగూడ తదితర గ్రామాల్లో ఆదివాసులు… సమీప అటవీ ప్రాంతంలో దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లు,మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పంటలు బాగా పండాలని, అటవీ జంతువుల నుంచి పశువులను కాపాడాలని వేడుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని గ్రామ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అమృత్ రావ్, పొచ్చంపల్లి సర్పం చ్ జయ బాయి,రిమ్మసర్పంచ్ అనిల్ కుమార్, గ్రామపెద్దలు లచ్చు, జంగు, పాండు, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూలై11: మండలంలోని హీరా పూర్ పరిధి మారుతీగూడకు చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వనదేవతకు ప్రత్యేక పూజ లు చేశారు. ముందుగా గ్రామ పొలిమేరలోని పోచమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకు న్నారు. అనంతరం గిరిజనులు సహపంక్తి భోజనా లు చేశారు. గ్రామంలోని పశువులను అటవీ ప్రాంతంలో వనదేవత చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. పంటల్లో కలుపు పనులకు శ్రీకారం చుడు తున్నట్లు గిరిజన పెద్దలు తెలిపారు.
నార్నూర్, జూలై 11: మండలంలోని ఎంపల్లి గోండుగూడలో అకాడీ పూజలు చేశారు. గ్రామ పొలిమేరలో వనదేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పూజారి పెందోర్ శ్యాంరావ్, గ్రామపటేల్ పెందోర్ అమృత్రావ్,గ్రామస్తులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సత్వదేవ్, నిత్యా మీనన్ స్కైలాబ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
రష్మిక సెల్ఫీ పోస్ట్..’అతడు ఎవరు’ అంటూ ఫ్యాన్స్ టీజింగ్
వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతం
పంజాబ్ బీజేపీ నేతలపై రైతుల దాడి