నాగర్ కర్నూల్ : జిల్లాలో విషాదంచోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోబోయిన కొడుకును కాపాడే ప్రయత్నంలో ఓ తల్లి విదుదాఘాతానికి గురై తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కుటుంబ కలహాలతో కలత చెందిన రాములు అనే వ్యక్తి తమ ఇంటి సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాగా, రాములును కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తల్లి అంతమ్మ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రాములు, అతని కుమారుడు, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని జడ్చర్ల దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు