న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తులు నేటినుంచి ఆరంభమయ్యాయి. అర్హత కలిగినవారు ఈనెల 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 5008 పోస్టులు భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 5008
ఇందులో జనరల్ 2143, ఈడబ్ల్యూఎస్ 490, ఓబీసీ 1165, ఎస్సీ 743, ఎస్టీ 467 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27
ప్రిలిమినరీ ఎగ్జామ్: నవంబర్ నెలలో
వెబ్సైట్: https://sbi.co.in