రామగిరి, మే 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నల్లగొండలోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుత్తా భగత్ను శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నోముల నర్సింహయ్య వారసుడిగా ఆయనకు ఉన్న మంచి పేరును కాపాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ఏ సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని గుత్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.