క్రికెట్ స్టేడియం
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వైభవ్ గెహ్లాట్ హాజరయ్యారు. దీని సీటింగ్ కెపాసిటీ 75,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించనున్నారు. అహ్మదాబాద్లోని మోతెరా క్రికెట్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ లక్షా పదివేలు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సీటింగ్ కెపాసిటీ లక్ష.
1000వ వన్డే
ప్రపంచ క్రికెట్లో 1000వ వన్డే ఆడిన తొలి జట్టుగా భారత్ టీం రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్లో భారత్ వెస్టిండీతో తొలి వన్డే ఆడి గెలిచింది. ఈ వన్డేతో ఈ భారత్ టీం ఈ మైలురాయిని చేరింది.
టాటా ఓపెన్ టెన్నిస్
టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ను పోర్చుగల్ ఆటగాడు జోవో సౌసా గెలుచుకున్నాడు. మహారాష్ట్రలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌసా ఫిన్లాండ్ ఆటగాడు ఎమిల్ రుసువూరిని ఓడించాడు. డబుల్స్ టైటిల్ను రోహన్ బోపన్న-రామ్కుమార్ రామనాథన్ జోడీ గెలుచుకున్నారు. వీరు ఆస్ట్రేలియా జోడీ ల్యూక్ సావిల్లే-జాన్ పాట్రిక్ స్మిత్పై గెలిచారు.
ఆసియా కప్ ఫుట్బాల్
2022 ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీని చైనా జట్టు సాధించింది. ముంబైలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా దక్షిణ కొరియాను ఓడించింది. ఈ ఆసియా కప్ను గెలవడం చైనాకు ఇది తొమ్మిదోసారి.
అండర్-19 క్రికెట్
2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. అంటిగ్వాలో ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. భారత్కు ఇది అయిదో అండర్-19 ప్రపంచ కప్.
సెనెగల్
సెనెగల్ ఫుట్బాల్ టీం తొలి ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ను సాధించింది. ఫిబ్రవరి 6న కామెరూన్ యౌండేలోని ఒలెంబే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈజిప్ట్ను ఓడించింది.