హైదరాబాద్: బీటెక్లోని (B.Tech) 18 కోర్సుల్లో చేరడానికి ఇంటర్ (ప్లస్ టూ) స్థాయిలో ఫిజిక్స్, గణితం సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టంచేసింది. ఈ మేరకు అప్రూవల్ హ్యాండ్ బుక్లో ఏఐసీటీఈ ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్, గణితం సబ్జెక్టులు తప్పనిసరి కాదని వెల్లడించిన ఏఐసీటీఈ.. ఆయా నిబంధనను తాజాగా వెనక్కి తీసుకున్నది. మొత్తం 29 బీటెక్ కోర్సుల్లో 18 కోర్సుల్లో చేరడానికి పాఠశాల స్థాయిలో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం, రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలని తెలిపింది.
గతంలో ఫిజిక్స్, గణితం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, బయో టెక్నాలజీ, అగ్రికల్చర్, బిజినెస్ వంటి 14 సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు వచ్చినా బీటెక్లో చేరవచ్చని ఏఐసీటీఈ ప్రకటించింది. తాజాగా ఈ రెండు సబ్జెక్టులను తప్పనిస రిచేసింది. ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీలో చేరే అభ్యర్థులు 14 సబ్జెక్టుల్లో అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, లెదర్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, ప్రింటింగ్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ కెమిస్ర్టీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో నుంచి ఏదేని మూడు సబ్జెక్టులు చదివినా సరిపోతుంది. వీరికి గణితం తప్పనిసరికాదు.