హైదరాబాద్: విద్యార్థులకు జేఎన్టీయూ (JNTU) శుభవార్త చెప్పింది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ఇకపై ప్రతి నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ కే. వెంకటేశ్వర రావు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఫిబ్రవరి 22 నుంచే ఇది అమలులోకి రానుంది.
కాగా, ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 2008కి ముందు కూడా దీనిని అమలు చేశారు. అయితే 2008 తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరించారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.