JEE Main | ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష తేదీలు మారాయి. ఈ పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. ముందుగా విడుదల చేసిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది.
కాగా, జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అడ్మిట్ కార్డులను పరీక్షలకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో NTA అందుబాటులో ఉంచనుంది. మరోవైపు మొదటి సెషన్ పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. పేపర్-1 కోసం 95.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 12న వీటికి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి.