IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఇటీవల ప్రారంభించింది.
ఈ ప్రోగ్రాం ఆన్ క్యాంపస్, ముఖాముఖి సెషన్స్, లైవ్ ఇంటరాక్టివ్ ఆన్లైన్ సెషన్స్ కలయికతో ఉంటుంది. మూడేండ్ల ఉద్యోగానుభవం ఉన్న వ్యక్తుల కోసం ఈ ప్రోగ్రాంను ఐఐఎం అహ్మదాబాద్ రూపొందించింది.
మూడేండ్ల పూర్తిస్ధాయి ఉద్యోగానుభవం, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ప్రవేశ ప్రక్రియలో భాగంగా అడ్మిషన్ టెస్ట్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Read More :