హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్ (ICET) ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయింది. ఎంబీఏలో 19,867 సీట్లు, ఎంసీఏలో 2535 సీట్లు కేటాయించామని ఐసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఎంబీఏలో 5421 సీట్లు, ఎంసీఏలో 41 సీట్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. సీట్లు పొందిన వారు ఈనెల 27 వరకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. డిసెంబర్ 1 వరకు కాలేజీల్లో చేరవచ్చని తెలిపారు.