గ్రూప్స్ ప్రత్యేకం తెలంగాణ చరిత్ర
1. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన 369 మందికి స్మారకంగా ఈ స్థూపం నిర్మించారు
2. గన్పార్క్ ఉన్న అమరవీరుల స్మారక స్థూపరూప శిల్పి ఎక్కా యాదగిరిరావు పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవిడి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : గన్పార్క్ ఉన్న అమరవీరుల స్మారక స్థూపరూప శిల్పి ఎక్కా యాదగిరిరావు. స్థూపం ప్రత్యేకత – 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన 369 మందికి స్మారకంగా ఈ స్థూపం నిర్మించారు. నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులు స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెలుపుతుంది. ఈ పై భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది. ఎర్రరాతి పై భాగంలో మళ్లీ నల్లరాతిలో 9 గీతలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి. నల్లరాతి స్తంభం పై భాగంలో ఎర్రరాతి ఉంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది. ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతికి, త్యాగానికి చిహ్నాలుగా ఉంటాయి. ఈ స్థూపం నిర్మాణం 1975లో పూర్తిచేశారు.
ఎ) కుమార్ లలిత్
బి) సునీల్ కుమార్
సి) అనిల్ కుమార్
డి) నరేష్ కుమార్ జవాబు : ఎ
వివరణ : తెలంగాణ మిగులు నిధులపై కాగ్ అధికారి కుమార్ లలిత్ నేతృత్వంలో మిగులు నిధుల లెక్కలు తేల్చేందుకు కమిటీ ఏర్పడింది. 1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా 1969 జనవరి 23న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
33. కింది వాక్యాలను పరిశీలించండి.
1. 1969, ఫిబ్రవరి 3న జీవో 36 ప్రాథమిక హక్కులకు వ్యవతిరేకం అని హైకోర్టు
జీవో 36ను కొట్టేసింది
2. డివిజన్ బెంచ్ 1969, ఫిబ్రవరి 20న ముల్కీ రూల్స్ చెల్లుతాయని తీర్పునిచ్చింది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి
డి) పైవేవీ సరైనవి కావు జవాబు : సి
వివరణ : 1969 ఫిబ్రవరి 3న జీవో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అని హైకోర్టు జీవో 36ను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజినల్ బెంచ్కు అప్పీల్ చేసింది. ఈ డివిజన్ బెంచ్ 1969 ఫిబ్రవరి 20న తేదీన ముల్కీ రూల్స్ చెల్లుతాయని తీర్పునిచ్చింది.
1. ప్రత్యేక తెలంగాణను కోరిన తొలి రాజకీయ పార్టీగా ‘స్వతంత్ర పార్టీ’ చరిత్రలో నిలిచింది
2. గౌతు లచ్చన్న ఆంధ్ర ప్రాంతానికి
చెందిన వాడు
3. గౌతు లచ్చన్న అధ్యక్షతన సమావేశమైన స్వతంత్ర పార్టీ కార్యవర్గం ‘ప్రత్యేక
తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1, 2 సరైనది బి) 1, 3 సరైనది
సి) 2, 3 సరైనవి డి) పైవన్నీ సరైనవే
జవాబు : డి
వివరణ : ప్రత్యేక తెలంగాణ కోరిన ‘తొలి రాజకీయ పార్టీ’ – స్వతంత్ర పార్టీ 8గౌతులచ్చన్న అధ్యక్షతన సమావేశమైన స్వతంత్రపార్టీ చరిత్రలో నిలిచింది. గౌతులచ్చన్న ఆంధ్రప్రాంతానికి చెందినవాడు.
35. కింది వాక్యాలను పరిశీలించండి.
1. కొలిశెట్టి రామదాసు పంతులు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని
ఆచరణలో పెట్టిన మొదటి వ్యక్తి
2. 1970, జనవరిలో కొలిశెట్టి రామదాసు
ఆధ్వర్యంలో ఖమ్మం డిగ్రీ విద్యార్థి
రవీంద్రనాథ్ రెండు వారాల పాటు నిరాహార దీక్ష చేపట్టారు.
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : ఎ
వివరణ : కొలిశెట్టి రామదాసు పంతులు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆచరణలో పెట్టిన మొదటి వ్యక్తి. ఇతను ఖమ్మం ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సోషియాలజీ పూర్తి చేసి అప్రెంటిషిప్గా సింగరేణి, బెల్లంపల్లి బొగ్గుగనుల్లో పనిచేశారు. తదనంతరం పై చదువుల కోసం మద్రాసు వెళ్లి డిప్లొమా పూర్తి చేశారు. 1969 ఉద్యమాన్ని ప్రారంభించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఆపకూడదనే కార్యాచరణను తొలిసారి ప్రారంభించింది ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు. ఖమ్మంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కొక్కరిని చేరదీసి జిల్లాలన్నీ తిరిగి నాయకులను, కార్మికులను, ఉద్యోగులను, విద్యార్థులను కలిసి 1969 జనవరిలో ఖమ్మం డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో రెండు వారాల ఆమరణ నిరాహారదీక్ష చేయించిన మార్గదర్శి కొలిశెట్టి రామదాసు.
1. 1969, జనవరి 13న వరంగల్ నగరం
లోని మేధావులు సమావేశమై తెలంగాణ పరిరక్షణల కమిటీని స్థాపించారు
2. తెలంగాణ పరిరక్షణల కమిటీకి అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణను ఎన్నుకొన్నారుపై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : బి
వివరణ : 1969 జనవరి 13న హైదరాబాద్లోని మేధావులు సమావేశమై ‘తెలంగాణ పరిరక్షణల కమిటీ’ని స్థాపించారు. తెలంగాణ పరిరక్షణల కమిటీకి అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సమర యోధుడు ‘కాటం లక్ష్మీనారాయణ’ను ఎన్నుకొన్నారు.
ఎ. కొండా లక్ష్మణ్
బి. కాళోజీ నారాయణ రావు
సి. చంద్రశేఖర్ రావు
డి. హరీశ్ రావు జవాబు : ఎ
వివరణ : కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా 8 1969 మార్చి 28న తెలంగాణ సమస్యలపై ప్రాంతీయ ప్రతిపత్తి కోరుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి 23 రాజీనామా చేశాడు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న మొదటి వ్యక్తి కొండాలక్ష్మణ్. మేఘాలయ వలె ప్రాంతీయ ప్రతిపత్తిని ఆయన కోరాడు. దీని ప్రకారం ప్రణాళిక, అభివృద్ధి, బడ్జెట్, ఉద్యోగులు తెలంగాణ నిర్వహించుకుంటుంది. ఈ సూచనలకు ప్రధాని, ముఖ్యమంత్రి, హైకమాండ్, అంగీకరించడం వల్ల మంత్రిపదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ ఒకటే పరిష్కారమన్నాడు. 1969, మార్చి 30న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు.
1. 8 సూత్రాల పథకం ప్రకారం తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి రాజ్యాంగపరమైన పరిష్కారాలు సూచించడానికి జస్టిస్ వాంఛూ కమిటీని నియమించారు
2. 8 సూత్రాల పథకం ప్రకారం తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి వసిష్ఠ భార్గవ అధ్యక్షతన ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించారు
3. జస్టిస్ వాంఛూ కమిటీ నివేదిక ప్రకారం ముల్కీ నిబంధనల అమలుకోసం రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు
4. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధుల కుమార్ లలిత్ కమిటీ అంచనాల కంటే ఎక్కువ పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1, 2 సరైనది బి) 1, 3 సరైనది
సి) 2, 3 సరైనవి డి) పైవన్నీ సరైనవే
జవాబు : ఎ
వివరణ : జస్టిస్ వాంఛూ కమిటీ 1969 ఏప్రిల్ 11న ప్రధాని లోక్సభలో ప్రకటించిన మేరకు తెలంగాణ ఉద్యోగ సమస్యలను అధ్యాయనం చేసి రాజ్యాంగ పరమైన పరిష్కారాలు చూపించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ‘జస్టిస్ వాంఛూ’ ఆధ్వర్యంలో న్యాయ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం 1969 ఏప్రిల్ 19న ఏర్పాటు చేసింది.
చైర్మన్ – వాంఛూ సభ్యులు
1. ఎం.సి. సెతల్వాడ్
(మాజీ అటార్నీ జనరల్)
2. నిరేన్ డే (నాటి అటార్నీ జనరల్)
కమిటీ సూచనలు – 8ఈ కమిటీ 1969లో నివేదిక సమర్పించింది. రాష్ట్ర ఉద్యోగాల్లో ఆ రాష్ర్టానికి ప్రాధాన్యం లభించేలా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యం లభించేలా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదు. ఈ కమిటీ ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి వీలులేదని పేర్కొంది.
81969 ఏప్రిల్ 11న ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన ఎనిమిది సూత్రాల పథకంలో హామీ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తేల్చడానికి సుప్రీం కోర్టు న్యాయవాది ‘వశిష్ఠ భార్గవ’ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.
8సభ్యులు 1- విహరిమధుర్, 2- హరిభూషన్ బార్ ఈ కమిటీకి కార్యదర్శిగా కృష్ణస్వామిని నియమించారు. తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి కింది అంశాలను ఆధారాలుగా తీసుకోవాలని భార్గవ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
అవి.. 1. పెద్ద మనుషుల ఒప్పందం – 1956 (పేరా – 1.3)
2. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1956లో కుదిరిన ఒప్పందం
3. 1969 జనవరి 19న జరిగిన అఖిల పక్ష సమావేశం భార్గవ కమిటీ ముందు వశిష్ఠ భార్గవ కమిటీ లలిత్ కమిటీ అంచనా కంటే రూ. 5.75 కోట్లు తక్కువ అంచనా వేసింది.
1. మే 1న కోరికల రోజున పోలీసులు కాల్పుల్లో మరణించిన వారి జ్ఞాపకార్థం మే 18న హైదరాబాద్లో తెలంగాణ మృత వీరుల రోజును పాటించారు
2. చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి..’ అంటూ సంగం రెడ్డి
సత్యనారాయణ పాటలు పాడారు
పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : బి
వివరణ : మే 1న కోరికల దినం రోజున పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి జ్ఞాపకార్థం మే 17న హైదరాబాద్లో తెలంగాణ మృత వీరుల రోజును పాటించారు. అప్పుడే “లారీ, గోలీ భాయింగే తెలంగాణ లేయింగే” నినాదం ఇచ్చారు.
8 తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అయ్యేకొద్ది మర్రి చెన్నారెడ్డిపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి చెన్నారెడ్డి.. నీ కోసం మేమంత నిలిచి ఉన్నామురా రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి’ అంటు సంగం రెడ్డి సత్యనారాయణ పాటలు పాడారు.
– దొమ్మటి తిరుపతి ఫ్యాకల్టీ, ఎస్ జే ట్యుటోరియల్స్