హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్-DOST) నోటిఫకేషన్ నేడు విడుదల కానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్ నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయనున్నారు. దీనిద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. దోస్త్ నోటిఫికేషన్ మంగళవారమే విడుదల చేయాల్సి ఉండగా, ఇంటర్ ఫలితాల విడుదల కారణంగా నేటికి మార్చారు.
కాగా, సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో సుమారు 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని విడుతల వారీగా భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్సైట్, టీఎస్ ఫోలియో యాప్, యూనివర్సిటీల వెబ్సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.