హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానింస్తున్నది. అర్హులైన విద్యార్థులు జూన్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 10న రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ను, 040-23322377, 23328266 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.