ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
మండలాల్లో అంబరాన్నంటిన టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
కొత్తూరు రూరల్, మార్చి 20: వాణీదేవి గెలుపు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో జడ్పీటీసీ శ్రీలత, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను పూలమాల, శాలువాతో సన్మానించి స్వీట్లు తినిపించారు. అనంతరం జడ్పీటీసీకి ఎమ్మెల్యే స్వీట్ తినిపించి అభినందించారు. కార్యక్రమంలో సిద్ధ్దాపూర్ ఎంపీటీసీ బాలయ్య పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ, మార్చి 20 : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపుతో మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ నాయకుల సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట, మార్చి 20 : మండల కేంద్రంలో శనివారం పటాకులు కాల్చి టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై విజయం సాధించడంపై హర్షం వ్యక్త చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, నాయకులు బాల్రాజ్గౌడ్, శేఖర్పంతులు, పల్లాటి సురేందర్, యారం శేఖర్రెడ్డి, కృష్ణయాదవ్, మురళీమోహన్, దొబ్బల వెంకటయ్య, నవీన్కుమార్ పాల్గొన్నారు.
చేవెళ్ల టౌన్లో..
చేవెళ్ల టౌన్, మార్చి 20 : ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పార్టీ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యరెడ్డి, ఎంపీటీసీలు సత్యనారాయణ చారి, రవీందర్ రెడ్డి, పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పక్షానే పట్టభద్రులు
షాద్నగర్, మార్చి20 : సామాన్య ప్రజలే కాకుండా పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు, మేదావులు టీఆర్ఎస్ పక్షానే నిలబడ్డారనే విషయం ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపుతో రుజువైందని టీఆర్ఎస్ నాయకు లు అభిప్రాయపడ్డారు. షాద్నగర్ పట్టణ చౌరస్తాలో నాయకులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహ, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు జూపల్లి శంకర్, రాజ్యలక్ష్మి, నందకిశోర్, నక్కల వెంకటేశ్, చెట్ల నర్సింహ అశోక్, నవీన్, శ్రీకాంత్, నరేశ్ పాల్గొన్నారు.
అంబరాన్నంటిన సంబరాలు
కొత్తూరు రూరల్, మార్చి 20: మండల కేంద్రంలో కొత్తూరు మాజీ ఎంపీటీసీ బాతుక దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు పట్టం కడుతున్నాయన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ కోస్గీ శ్రీను, సింగిల్విండో డైరెక్టర్ సాయిలు, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండల మాజీ ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, జనార్దన్చారి, నాగరాజుగౌడ్, రాఘవేందర్యాదవ్ పాల్గొన్నారు.