దేశంలో గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ బుసలు కొడుతున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కేసులు నమోదయ్యాయి. గత మూడు మాసాల్లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఒక్కరోజులో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజే 16,620 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాథుర్లో ఈ నెల 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.