బన్సీలాల్పేట్, నవంబర్ 12: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) జాతీయ యూనియన్ కౌన్సిలర్గా తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా వై.ఎస్.శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కమలకాంత్ త్రిపాఠి ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, నవంబర్ 14, 15 తేదీలలో బిహార్లోని బుద్ధగయలో జరుగనున్న అఖిల భారత కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ తరఫున హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. కరీంనగర్లోని దుర్శేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వైఎస్.శర్మ ఎంపిక పట్ల సంఘం ప్రధాన కార్యదర్శి పి.పార్థసారధి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కె.హన్మంత రావు, కార్యదర్శి నరోత్తంరెడ్డి అభినందనలు తెలిపారు.