హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) రెండేండ్ల తర్వాత హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసానికి వెళ్లనున్నారు. తల్లి వైఎస్ విజయమ్మను కలువనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గత నెల ఎర్రవెల్లిలోని నివాసంలో కాలుజారి పడటంతో ఎడమకాలు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడలోని యశోద దవాఖానలో కేసీఆర్కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత.. ప్రస్తుతం బంజారాహిల్స్ నందీ నగర్లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్తో లంచ్ తర్వాత లోటస్పాండ్లోని తన నివాసానికి జగన్ వెళ్లనున్నారు.
నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన సీఎం జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. జగన్తోపాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.