కమలాపూర్: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరేందుకు యువత క్యూ కట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్..పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు కృషిచేయాలని సుమన్ పిలుపునిచ్చారు.