ఆర్బీఐ కొత్త నిబంధనలే కారణం
ఏప్రిల్ 1 నుంచి ఏఎఫ్ఏ తప్పనిసరి
న్యూఢిల్లీ, మార్చి 30: టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీచార్జ్లు, పోస్ట్పెయిడ్ సర్వీసులు, ఇతర వినిమయ సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులను చెల్లించేందుకు ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకున్నారా? అయితే రేపటి నుంచి మీ చెల్లింపులు ఆగిపోవచ్చు. ఆటో డెబిట్ పద్ధతిలో జరిపే చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండటమే ఇందుకు కారణం.
డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే రికరింగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్కు ఓటీపీ నిర్ధారణ తప్పనిసరి. దీంతో ఆటో డెబిట్ షెడ్యూల్ తేదీకి 5 రోజుల ముందే సంబంధిత బ్యాంక్ నుంచి వినియోగదార్లకు అలర్ట్ వస్తుంది. అప్పుడు ఓటీపీతో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్ పూర్తవుతుంది.
వాస్తవానికి ఏఎఫ్ఏ నిబంధనలను అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కాలేదు. మరోవైపు ఈ నిబంధనల అమలుకు నిర్దేశించిన గడువు (మార్చి 31)ను పొడింగించాలన్న ఐబీఏ విజ్ఞప్తిని రిజర్వు బ్యాంక్ ఇప్పటికే తిరస్కరించింది.
ఫలితంగా ఆటో డెబిట్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తున్న కస్టమర్లకు ఏప్రిల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే యూపీఐ లోని ‘ఆటో పే’ ఫీచర్ను ఉపయోగించి రికరింగ్ చెల్లింపులు జరిపే వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!