హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లను కోల్పోగా తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బొక్కబోర్లా పడింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డులను వైసీపీ కైవసం చేసుకున్నది. టీడీపీ కేవలం 6 సీట్లలోనే గెలిచింది. 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ ఫలితాలు పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తారని అనుకోవడం లేదన్నారు.