అమరావతి : హిందూపురం వైసీపీ ( YCP) నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Mohammed Iqbal ) బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహ్మద్ ఇక్బాల్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ (Balakrishna) పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించి భంగపడ్డ ఇక్బాల్ గత నాలుగురోజుల క్రితం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు సీఎం జగన్కు, మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపించారు.