అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని, ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సీఎం జగన్పై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు, దేవినేని డ్రామా ఆర్టిస్ట్లని, దేవినేని ఉమా కాదు సొల్లు ఉమాగా పిలవాలంటూ ఆయన విమర్శించారు.