యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేంద ర్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 సహకార సంఘాలకు నాబార్టు ద్వారా రూ. 2కోట్ల రుణాలను త్వరలో అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలోని రైతువేదిక భవనంలో నల్లగొండ డీసీసీబీ, నాబార్డు సౌజన్యం ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన రైతులకు నగదు లావాదేవీలపై పలు సూచనలు చేశారు. రుణాలు పొందిన సంఘాలు తమ తమ సంఘాల ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
వంగపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చొల్లేరు, మోటకొండూర్ గ్రామాలలో 3 ఎకరాలలో గోధాం, వంగపల్లిలో పెట్రోల్ బంకు నిర్మాణం, చిన్న కందుకూరు ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నామన్నారు. పీఏసీఎస్కు కొనుగోలు చేసే అవ కాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ ఏడాదిలో 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 8.30 శాతం వడ్డీతో దీర్ఘకాలిక రుణాలకు రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా 120కోట్ల పంట రుణాలను రైతులకు అందజేశామని, ఇందులో ఆలేరు నియోజకవర్గంలో 27 కోట్ల రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వాలు పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేవలం రూ.50 లక్షల వరకు రుణాలు అందజేశా రని, సీఎం కేసీఆర్ హాయాంలో రైతుకు ఎంత అవసరముంటే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇండ్ల నిర్మా ణాలకు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందజేయనున్నట్లు వివరించారు.
డైయిరీ ఉత్పత్తులకు సబ్సిడీ రుణాలను పంపిణీ చేస్తామని గుర్తు చేశారు. రూ.కోటి రుణాలు అందజేస్తామని ఇందులో బీసీ రైతులకు 25శాతం, ఎస్సీ రైతులకు 33 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. నార్ముల్ పరిధిలో 302 పాల సంఘా లుంటే ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 140 పాల సంఘాలున్నాయని చెప్పారు. ఫౌల్ట్రీ, గొర్రెల పెంపకం, పందుల పెంప కానికి 50 శాతం సబ్సిడీ రుణాలు అంజేయనున్నట్లు తెలిపారు. నాబార్డు డీడీఎం వినయ్కుమార్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై రైతులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ, ఎన్డీసీసీబీ సీఈవో మదన్మోహన్, ఎన్డీసీసీబీ డైరక్టర్ అందెం లింగ య్య యాదవ్, మదర్ డైయిరీ డైరక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, కందాల అలివేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఎంపీటీసీలు పోషయ్య, రేపాక మౌనిక, సర్పంచ్ కానుగు కవిత, ఆలేరు పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, డీసీసీబీ బ్యాంకు మేనేజర్ కావ్య, వంగపల్లి పీఏసీఎస్ డైరక్టర్లు భిక్షంగౌడ్, యాదిరెడ్డి, పన్నాల అనిత తదితరులు పాల్గొన్నారు.