యాదాద్రి, నవంబర్ 15: యాదాద్రీశుడి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం మేడ్చల్ జిల్లాకు చెందిన పీ అరుణ-ప్రభాకర్ దంపతులు, అదే జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన భాగ్యమ్మ-నర్సింహ, భాగ్యలక్ష్మి-యాదగిరి, సత్తమ్మ-అనసూర్య దంపతులు తలా రూ.50 వేల చొప్పున చెక్కులను ఈఓ ఎన్ గీతకు అందజేశారు.
ఖాతా నంబర్
6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011,
ఇండియన్బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్