యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో శనివారం సర్వేషామేకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితు లు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు స్వామి వారి బాలాలయంలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి.
ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాల తో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తున్నదని ఆలయ అర్చకులు నల్లంధీగళ్ లక్ష్మీనారసింహచార్యులు తెలిపారు. వేడుకల్లో ఆలయ ఏఈవోలు గజవెల్లి రమేశ్బాబు, గట్ట శ్రవణ్కుమార్, దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.