దోహా: ఖతార్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ టోర్నీ డ్రా విడుదలైంది. అతిరథ మహారథుల మధ్య దోహా ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కేంద్రంగా శుక్రవారం అట్టహాసంగా జట్ల విభజన జరిగింది. మెగాటోర్నీకి ఇప్పటికే 29 జట్లు అర్హత సాధించగా, మిగతా మూడు జట్ల కోసం మ్యాచ్లు జరుగనున్నాయి. తొలుత ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ప్రారంభ ఉపనాస్యం చేశారు. ఆ తర్వాత పలువురు దిగ్గజ ప్లేయర్లు డ్రాలో పాల్గొన్నారు. గ్రూపు-బిలో ఇరాన్, అమెరికా, ఇంగ్లండ్ కొలువుదీరాయి. గ్రూపు-ఏలో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్ ఉన్నాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూపు-సిలో అర్జెంటీనా, సౌదీఅరేబియా, మెక్సికో, పోలాండ్ ఉండగా, గ్రూపు-డిలో ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునీషియా చోటు దక్కించుకున్నాయి.