హైదరాబాద్ : రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కొనియాడారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద 50 వేల కోట్ల రూపాయలు అందజేశారన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్లు కలిసి కృతజ్ఞతలు తెలిపి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందిస్తూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా డీసీఎంఎస్ చైర్మన్లు రైతులతో మమేకమై పని చేయాలన్నారు.