Womens T20 WC : టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు నాకౌట్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒత్తిడిని తట్టుకోలేక మ్యాచ్ను అప్పగించేసింది. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 140 రన్స్ మాత్రమే చేసింది. వరల్డ్ కప్లో భారత జట్టుపై ఇంగ్లండ్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడు విజయాలతో ఇంగ్లండ్ గ్రూప్ -బిలో టాప్ ప్లేస్లో నిలిచింది.
స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అర్థ శతకం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జట్టు స్కోర్ 105 వద్ద మంధాన ఔట్ అయింది. అప్పుడే ఇంగ్లండ్ విజయం దాదాపు ఖరారైంది. అయితే.. రీచా ఘోష్ (47) పోరాడినా మ్యాచ్ గెలిపించలేక పోయింది. ఇంగ్లండ్ బౌలరల్లో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ తలా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నాట్ సీవర్ బ్రంట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కీలకమైన మ్యాచ్లో ఇండియా టాపార్డర్ విఫలం అయింది. భారీ టార్గెట్ ఛేదనలో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) స్వల్ప స్కోర్కే వెనుదిరిగింది. దాంతో 29 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మంధాన జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది. సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆమె ఆ తర్వాతి బంతికే ఔట్ అయింది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ (13) విఫలం అయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (4), దీప్తి శర్మ (7) నిరాశ పరిచారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 151 రన్స్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీ, అమీ జోన్స్(40) రాణించారు. అమీ జోన్స్(26)తో కలిసి సీవర్ ఐదో వికెట్కు 38 రన్స్ జోడించింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ విజృంభించడంతో ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో.. నాట్ సీవర్ బ్రంట్ , హీథర్ నైట్ జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. మరో వికెట్ పడకుండా చూసుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. మూడో వికెట్కు ఫిఫ్టీ రన్స్ జోడించారు. రేణుకా సింగ్ ఐదు వికెట్లు తీసింది.