యాదాద్రి, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం కేసీఆర్ మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధాబీరయ్య, కౌన్సిలర్లు ఆవుల మమతాసాయి, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, మహమ్మద్ రిజ్వాన, మహిళా నాయకురాలు అనందాస్ సుజాత, యాదమ్మ, జయమ్మ, భారతమ్మ పాల్గొన్నారు.
ఆలేరు : ఆలేరు పట్టణంలో టీఆర్ఎస్ మహిళ పట్టణాధ్యక్షురాలు సీస మహేశ్వరి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చంద్రకళ, కౌన్సిలర్ దాసి నాగలక్ష్మి, సునీత, విజయ, కోఆప్షన్ సభ్యులు బింగి లత, భాగ్యలక్ష్మి, భాగ్య, అరుణ, రేణుక పాల్గొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో మహిళలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ కాలే సుమలత, సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్ మాడోతు రాణి, మాడోతు సునీత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గౌటే లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంటి కృష్ణ, సర్పంచులు గుంటి మధుసూదన్రెడ్డి, ధర్మేందర్సింగ్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని జగ్యాతండా, ముల్కలపల్లి, రుస్తాపురం, వెంకటాపురంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, సర్పంచులు పాల్గొన్నారు.
గుండాల : మహిళలకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువు అని ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అండెం మమత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆశవర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఎండీ.ఖలీల్, ఎంపీటీసీ కుంచాల సుశీలాఅంజిరెడ్డి, జిల్లా నాయకుడు చిందం ప్రకాశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ బీసు ధనలక్ష్మి, మహిళా విభాగం మండల ప్రధాన కార్యదర్శి తవిటి లక్ష్మి, గ్రామశాఖ అధ్యక్షురాలు తవిటి పద్మ, కార్యదర్శి నాతి శంకరమ్మ పాల్గొన్నారు.