న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: హైనాల మధ్య చిక్కుకుని ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న భర్తను ప్రాణాలకు తెగించి కాపాడింది భార్య. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కొండగావ్ జిల్లాలో నివసించే నందు యాదవ్ సోమవారం నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లగా, అతడిని కొన్ని హైనాలు చుట్టుముట్టి దాడి చేశాయి.
దీంతో అతను భయంతో కేకలు పెట్టాడు. అతడి అరుపులు విని సమీపంలో ఉన్న అతని భార్య సుగ్ని పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరుస్తూ వాటిని తరిమివేయడానికి ప్రయత్నించింది. అయినా అవి బెదరక దాడిని కొనసాగించాయి. అదృష్టవశాత్తు ఆమెకు అక్కడ పొలంలో ఒక కర్ర దొరికింది. దీంతో ఆ కర్రతో ఒక హైనాను ఆపకుండా తలపై కొట్టడంతో అది చచ్చిపోయింది. దీంతో మిగిలిన హైనాలు భయంతో పారిపోయాయి. చేతులు, కాళ్లు, పొట్టపై గాయాలైన నందు యాదవ్ను దవాఖానకు తరలించగా, ప్రాణాపాయమేమీ లేదని డాక్టర్లు చెప్పారు.