నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత కాలంగా ఆరోగ్యంగా బాగాలేక మనోవేదనకు గురైంది.
ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి స్థానిక మల్క చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలు పెద్ద కూతరు అమృత తెలిపింది.
అమృత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్జ్ ఏఎస్సై ప్రతాప్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.