గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ‘గోపీచంద్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో కనిపిస్తారు. ఆయన పాత్ర ైస్టెలిష్గా ఉంటుంది. పక్కా కమర్షియల్ అంశాల కలబోతగా అందరిని మెప్పిస్తుంది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కరమ్చావ్ల, సంగీతం: జకేస్ బీజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్, నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, నిర్మాత: బన్నీ వాసు.