హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్షాపులు మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు, అలాగే 6న వైన్స్లు మూసే ఉంచాలన్నారు.
ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఇప్పటివరకు 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్లు సీజ్ చేశామని, 48 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మునుగోడు వ్యాప్తంగా 118 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 5.59 లక్షలు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్, నారాయణపూర్ పరిధిలో వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.