హుజురాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, బ్రహ్మయ్య, రాజులున్నారు.