హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం అభ్యంతరకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రగతి కోసం కొత్త రాజ్యాంగం అనే పదాన్ని సీఎం కేసీఆర్ తెర పైకి తెచ్చారని తెలిపారు.
సీఎం కేసీఆర్ మనసులో దీనికి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన ఆయన విమర్శించారు.
సీఎం కేసీఆర్ అడిగిన మాటలకు సమాధానం చెప్పలేకనే ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు అన్నారు. రాజ్యాంగం పై చర్చించడానికి ముందుకు రావాలన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో పేదలు, సామాన్యులకు ఒక్క నయా పైసా ఉపయోగ పడేలా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని విమర్శించారు.