ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 30 : 1969లో సిరిసిల్ల, మాచారెడ్డి ప్రాంతాల్లో నాడు గడ్డి దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఎటు చూసినా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో తన పీఏ లక్ష్మారెడ్డి తండ్రి దత్తా రెడ్డి ఇటీవల మృతి చెందగా దశ దినకర్మకు హాజరయ్యారు. దత్తారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు.
తాను సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డిలో 1969లో సందర్శించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో వరి పండని కారణంగా పశువుల మేత కోసం గడ్డిని అమ్మేందుకు వచ్చే వారమని గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు కాలువలు, చెరువులో నీళ్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్, వైస్ ఎంపీపీ భాస్కర్, నాయకులు ఉన్నారు.