కమలాపూర్ రూరల్: ఎమ్మెల్యేగా 18 ఏండ్లు ఉన్న ఈటల రాజేందర్ ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి, దేశరాజుపల్లి, గూడూరు గ్రామాల్లో ఎంపీ బండా ప్రకాశ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావుతో కలిసి ఆదివారం పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈటల రాజీనామా తర్వాతే గ్రామాల్లో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో కుల వృత్తులు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ నాయ కులు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. గెల్లు సీనును గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వా లని కోరారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు కోరారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమం లో సర్పంచులు అంకతి సాంబయ్య, దాసరి రమేశ్, లడె గోపాల్, ఎంపీటీసీ పసరగొండ శైలజ, సుగుణాకర్రావు, నాయ కులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు.