హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అటు టీఆర్ఎస్ పార్టీ.. ఇటు బీజేపీ నాయకులు అన్ని గ్రామాల్లో కలియతిరుగుతున్నారు. కాగా, హుజూరాబాద్లో గురువారం ప్రచారం చేసేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు చుక్కెదురైంది. బీజేపీ నాయకులు వస్తున్నారని తెలుసుకున్న ఐదోవార్డు ప్రజలు గ్యాస్ సిలిండర్లను ఇంటి ఎదుట ఉంచి వినూత్న స్వాగతం పలికారు. గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలకు నిరసనగా ఇలా చేసినట్లు వారు చెప్పారు. ధరలు తగ్గించాకే బీజేపీ నాయకులు తమను ఓటు అడిగేందుకు రావాలని వారు డిమాండ్ చేశారు.