జైపూర్ : కొవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వారాంతపు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే ఈ సమయంలో అత్యవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల సరఫరా, ఎల్పీజీ బ్యాంకింగ్ సేవలు పని చేస్తాయని చెప్పారు. నిన్న ఒకే రోజు రాజస్థాన్లో 6,658 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. 33 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,276 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది.